NEET: వైద్య ప్రవేశ పరీక్ష NEET-UG 2024 ఫలితాలు వెలువడినప్పటి నుంచి దేశంలో ఉత్కంఠ నెలకొంది. అనేక రాష్ట్రాల్లో గ్రేస్ మార్కుల విషయంలో వివాదం తలెత్తింది. హర్యానాలో ఒకే సెంటర్కు చెందిన 6గురు చిన్నారులు 720 మార్కులు సాధించడంతో అక్రమాలు చోటుచేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులు మళ్లీ పరీక్షకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అధికారుల నిర్లక్ష్యం, అవకతవకల మధ్య విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా ప్రయత్నించారు. నీట్కు ప్రిపేర్ అయ్యేందుకు కోటాలో నివసిస్తున్న మధ్యప్రదేశ్లోని రేవాకు చెందిన విద్యార్థి ఫలితాలు వెలువడిన రెండో రోజున ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలన రేపింది. కోచింగ్ హబ్ గా పేరొందిన కోటాలో ఈ ఏడాది ఇది 11వ ఆత్మహత్య ఘటన. కాగా 2023 నుంచి ఇప్పటివరకూ 29 మంది నీట్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే పిల్లలో ఆందోళన, భయం తగ్గించి, విలువైన జీవితాన్ని అర్థాంతరంగా ముగించకుండా పేరెంట్స్ పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పూర్తిగా చదవండి..NEET-UG: నీట్ గందరగోళం మధ్య విద్యార్థుల్లో పెరుగుతున్న స్ట్రెస్.. ఎలా తగ్గించుకోవాలంటే..
నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకల కారణంగా అధిక శాతం పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నారు. గడిచిన రెండేళ్లో 13వేలకు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని NCRB వెల్లడించింది. పిల్లలను డ్రిప్రెషన్ కు దూరం చేసే నిపుణుల సూచనల కోసం పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: