NEET Exam : అది 2017 సెప్టెంబర్ 1, ప్రాంతం తమిళనాడు-కుజుమూర్..! 12వ తరగతిలో 1200 మార్కులకు 1176 మార్కులు తెచ్చుకున్న పేద దళిత కుటుంబానికి చెందిన అనిత ఉరేసుకోని ఆత్మహత్య (Suicide) చేసుకుంది. ఇంత మెరిట్ స్టూడెంట్ ఆత్మహత్యకు నీట్ (NEET) పరీక్షా విధానమే కారణమని తమిళనాడు (Tamilnadu) అట్టుడికిపోయింది. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలన్న అనిత కలను నీట్ పరీక్ష చిదిమేసింది. ఇలాంటి అనిత కథలు దేశంలోని అనేక గ్రామాల నుంచి వినిపిస్తాయి.. మనల్ని కలిచివేస్తాయి. 2024 నీట్ ఎగ్జామ్ వివాదాల సుడిగుండంలో చిక్కుకోని ఉంది. ఓవైపు ఎగ్జామ్ను రీకండెక్ట్ చేయాలన్న డిమాండ్.. మరోవైపు అసలు నీట్ పరీక్షనే రద్దుచేయాలన్న ఆందోళనలతో దేశంలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇంతకీ ఏంటీ నీట్ వివాదం.? ఈ పరీక్షను అనేక రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి?
పూర్తిగా చదవండి..NEET Exam Controversy : ఆది నుంచి వివాదాలే.. NEET పరీక్ష తీరుతెన్నులివీ..
జాతీయ స్థాయిలో మెడిసిన్ సీటు కొట్టాలంటే నీట్ పరీక్ష తప్ప ఇంకో ఆప్షన్ లేదని 2017లో కేంద్రం నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఏడేళ్లలో ప్రతిసారి నీట్ పరీక్ష జరిగినప్పుడల్లా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అసలు నీట్ పరీక్ష వివాదాలేమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
Translate this News: