Liquor Brands : నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపనీ (Som Distilleries Companies) తమ ఉత్పత్తులను తెలంగాణ (Telangana) బేవరేజ్ కార్పోరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చెప్పారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేవని, గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రోసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం బెవరేజ్ కార్పోరేషన్ కు ఉందని, ఈ నేపథ్యంలోనే సోమ్ డిస్టిలరీస్ కు తమ ఉత్పత్తుల సరఫరాకు అమమతినిచ్చారని వెల్లడించారు. బేవరేజ్ కార్పోరేషన్ రోజువారీ కార్యకలాపాలు తమ దృష్టికి రావని, వాస్తవవాలను తెలుసుకోకుండానే కొన్ని పత్రికలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు.
పూర్తిగా చదవండి..Telangana : తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు.. మందుబాబులకు మంత్రి జూపల్లి శుభవార్త!
మందుబాబులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభవార్త చెప్పారు. తెలంగాణలో కొత్త కంపెనీ బీర్లు రాబోతున్నట్లు తెలిపారు. నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందన్నారు.
Translate this News: