MLA Prakash Reddy: రాష్ట్రంలో టీడీపీ నాయకులంతా జూన్ 4వ తేదీ వరకు కలలు కనాలని.. ఆ తర్వాత వాస్తవంలోకి వస్తారని రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురం నగరంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 164 సీట్లతో తాము అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ వై నాట్ 175 అని ఊరికే చెప్పలేదని ఒకపక్క ప్లానింగ్ తోనే ఉన్నారని ఆయన అన్నారు.
పూర్తిగా చదవండి..Also Read: గూగుల్ మ్యాప్ని నమ్మి.. నట్టేట మునిగారు..!
అనంతపురం జిల్లాలో రాప్తాడు సహా మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతున్నామని ప్రకాష్ రెడ్డి అన్నారు. టీడీపీ నాయకులు ఓటమి భయంతో ఈ ఎన్నికల్లో అనేక కుట్రలు దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. టీడీపీ నాయకులు చెప్పిన విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని జిల్లాలో కొందరు ఎస్పీలను మార్చిందని.. వారు ఎక్కడైతే మార్పు చేశారో ఆయా ప్రాంతాల్లో గొడవలు జరిగాయన్నారు. ఈ సంఘటలన్ని చూస్తే తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితంగా వ్యవహరించిందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఎవరెన్ని చేసినా జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి అందరికీ వాస్తవాలు తెలుస్తాయన్నారు.
[vuukle]