Sun Effect : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Sun) మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ఏప్రిల్ తొలివారంలోనే భానుడు తీవ్రరూపం దాల్చాడు. అంతేకాకుండా ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు విలవిల్లాడుతున్నారు. భానుడి భగభగలతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తెలంగాణ(Telangana), ఏపీ(Andhra Pradesh) లోని అనేక ప్రాంతాల్లో సోమవారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని నేడు 63 మండలాలలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Sun : తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి.
Translate this News: