Protein Supplements: ఇటీవల పతంజలి ప్రోడక్ట్స్ పై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ గురించి మీరు వినే ఉంటారు. పతంజలి ప్రోడక్ట్స్ విషయంలో పతంజలి చేస్తున్న ప్రచారం నిజం కాదని.. ఆ ప్రాడక్ట్స్ పై తప్పుడు ప్రకటనలు ఇస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా కోర్టు పతంజలి పై కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఆ ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, ఇలా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్స్ విషయంలో పతంజలి మాత్రమే కాదు చాలా కంపెనీలు మనల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వాటిలో మన కండరాల బలాన్ని పెంచడానికి అవసరమైన ప్రోటీన్స్ అందిస్తాయి అని చెబుతూ వచ్చే ప్రోడక్ట్స్ విషయంలో వస్తున్న ప్రకటనల్లో చాలావరకూ మనల్ని తప్పుదోవ పట్టించేవే ఉంటున్నాయి. ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. విచిత్రం ఏమిటంటే.. శరీరంలోని కణజాలాల పెరుగుదల.. వాటి సమస్యల నివారణ.. వాటి నిర్వహణ కోసం అవసరమైన ప్రోటీన్స్ పేరుతో జరుగుతున్న వ్యాపార పరిమాణం. మార్కెట్ పరిశోధన సంస్థ IMARC గ్రూప్ ప్రకారం 2023లో భారతీయ ప్రోటీన్ ఆధారిత ప్రోడక్ట్స్ మార్కెట్ పరిమాణం ₹ 33,028.5 కోట్లకు చేరుకుంది.
పూర్తిగా చదవండి..Protein Supplements: ప్రకటనలు చూసి ప్రోటీన్ పౌడర్లను వాడేస్తున్నారా? ఆరోగ్యం పాడైపోవడం ఖాయం!!
మార్కెట్లో ప్రోటీన్ పౌడర్ల ప్రోడక్ట్స్ ప్రకటనలకు కొదువ లేదు. అయితే, వీటిలో దాదాపు 70 శాతం ప్రోడక్ట్స్ ప్రకటనల్లో చూపించినంత పనితీరు ఉన్నవి కాదని, వాటిలో చాలా వరకూ ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉందనీ నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఆర్టికల్ చూడండి
Translate this News: