హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీఫ్ తిన్నారంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కాంగ్రెస్ మంత్రి విక్రమాదిత్య సింగ్ కంగనా పేరు తీసుకోకుండా ఆమెను టార్గెట్ చేయడంతో ఇప్పుడు కంగనా రనౌత్ స్పందించింది. నేను బీఫ్, మరే ఇతర రెడ్ మీట్ తినను. నాపై నిరాధారమైన పుకార్లు ప్రచారం చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. నేను చాలా సంవత్సరాలుగా యోగిక్ ఆయుర్వేదానికి మద్దతునిస్తు ప్రచారం చేస్తున్నాను. ఇప్పుడు నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి వ్యూహాలు ఎలాంటి ప్రభావం చూపవు. నేను ఒక గర్వించదగ్గ హిందువునని నా ప్రజలకు తెలుసు. వారిని ఎవరూ తప్పుదారి పట్టించలేరని కంగానా వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Lok Sabha: నేను బీఫ్ తినను..నేను గర్వించదగిన హిందువును కంగనా!
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీఫ్ తిన్నారంటూ వస్తున్న ఆరోపణలపై కంగనా స్పందించారు. నేను గర్వించ దగ్గ హిందువునని..నేను ఏంటో నా ప్రజలకు తెలుసని ఆమె అన్నారు.
Translate this News: