Kishan Reddy: బీజేపీ కిసాన్ మోర్చా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు అభ్యర్థులు దొరకడం లేదని వ్యాఖ్యానించారు. టికెట్లు ఇచ్చిన పోటీ చేయమని వెనక్కి తగ్గుతున్నారని అన్నారు. మోదీకి (PM Modi) వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడుతున్నారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్రెడ్డి అన్నారు. బాయిల్డ్ రైస్ కొనాలని మోదీని కోరితే ఓకే చెప్పారు. ఈనెల ఒకటి నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోలను కేంద్రము ప్రారంభిస్తుందని కిషన్రెడ్డి అన్నారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: తెలంగాణలో కరవు.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి ఆగ్రహం!
తెలంగాణలో కరవుకు కాంగ్రెసే కారణమన్నారు కిషన్రెడ్డి. కరువుతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సాగు తాగు నీటి ఎద్దడి మొదలైందని.. పశువులకు తాగునీరు దొరకని పరిస్థితి వచ్చిందన్నారు. కరవు నుంచి ప్రజలను ఏ విధంగా కాపాడుతారో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Translate this News: