AP Politics: అనంతపురం జిల్లా గుంతకల్లో టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ప్రకటన రావడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ అనుచరులు పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ కార్యాలయంలోని కుర్చీలు జెండాలు పార్టీ సంబంధించిన పత్రాలను కింద వేసి పెట్రోల్ వేసి తగలబెట్టారు. పార్టీ కోసం కష్టపడిన జితేందర్ గౌడ్ కాకుండా ఇతర జిల్లా నుంచి వచ్చిన వైసీపీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి టీడీపీలోకి చేరగానే పార్టీ టికెట్ను కట్టబెట్టడంపై మండిపడుతూ చంద్రబాబుపై మాటల్లో చెప్పలేని దూషణలు దిగారు.పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పూర్తిగా చదవండి..AP Politics: గుంతకల్ టీడీపీలో నిరసన జ్వాలలు.. జెండాలను తగలబెడుతున్న తెలుగు తమ్ముళ్లు!
అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీలో నిరసనలు భగ్గుమన్నాయి. జయరాంకి టికెట్ కేటాయింపుపై జితేంద్ర గౌడ్ వర్గీయులు ఆగ్రహించారు. దీంతో టీడీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్టీ కార్యాలయంలోని టీడీపీ జెండాలు, పత్రాలు, కార్యాలయ బోర్డులను పెట్రోల్ పోసి తగలబెట్టారు.
Translate this News: