Nadendla Manohar: ఏపీలో జరుగుతున్న అవినీతిపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎన్నికల ప్రచారంలో 130 సార్లు బటన్ నొక్కినా ఒక్క రూపాయి అవినీతి జరగలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. రోజు మీడియాలో వస్తున్న అవినీతి వార్తలకు సమాధానం చెప్పాలని జగన్ ప్రభుత్వానికి ఆయన సవాల్ చేశారు. అవినీతి నిరోధక శాఖలో టోల్ ఫ్రీ నెంబర్ 14400కు.. 8,03,612 ఫిర్యాదులు వచ్చాయన్నారు. 2,16,803 ఫిర్యాదులు మంత్రులు, పేషీలపై వచ్చాయని తెలిపారు. 4,39,679 ఎమ్మెల్యే లపై వచ్చిన అవినీతి ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారో..? చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Nadendla Manohar: ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల కుంభకోణం.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు
ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగితే.. డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నాదెండ్ల మనోహార్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు..ఎన్ని కేసులు వచ్చాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుంభకోణాలపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల తెలిపారు.
Translate this News: