Janagama: జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనాపూర్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేష్ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీలో ఒక చీడపురుగులా టీడీపీ పార్టీ నుంచి వచ్చి తెలంగాణ ఉద్యమకారులను కడియం శ్రీహరి అనీచివేశాడని ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడిన తమలాంటి వాళ్ల మీద కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేశాడని ఆయన మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Janagama: ఊళ్లల్లో తిరగనివ్వం.. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నేతల వార్నింగ్!
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్లోకి ఎందుకు వెళ్తున్నావో చెప్పకపోతే గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.
Translate this News: