Viral News: ఇటివలి కాలంలో స్కూల్స్కు తాగేసి వస్తున్న టీచర్ల గురించి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనల అనేక చోట్ల జరుగుతున్నాయి. ముఖ్యంగా తాగి క్లాసులకు రావడమంటే అది చాలా పెద్ద తప్పు. అసలు తాగడం మంచిది కాదని పిల్లలకు టీచర్లే చెప్పాలి. మద్యపానం వల్లే వచ్చే సమస్యల గురించి వివరించాలి. అప్పుడే పిల్లలకు అది ఎంత హానికారమో తెలుస్తుంది. అయితే కొంతమంది టీచర్లకు ఇలాంటివి ఏమీ పట్టవు. తాగేసి క్లాసులకు రావడం.. పిల్లలను ఇష్టారీతిన బాదడం కొంతమందికి అలవాటుగా మారింది. ఇలాంటి ఘోరాలను చూస్తున్న పిల్లల్లో టీచర్పై కోపం పెరుగుతోంది. అది ఏదో ఒక రోజు తిరుగుబాటుకు కారణం అవుతుంది. టీచర్ను తరిమితరిమి కొట్టే వరకు తీసుకెళ్తుంది. నిన్న ఛత్తీస్గఢ్ ఘటన ఎంత వైరల్గా మారిందో తెలిసిందే. తాజాగా మన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసింది.
పూర్తిగా చదవండి..Viral News: మద్యం మత్తులో ప్రిన్సిపల్.. విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే షాకే!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీపల్లి గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. మద్యం సేవించి స్కూల్కు వచ్చిన ప్రిన్సిపల్ను విద్యార్థులు నిర్భందించారు. ప్రిన్సిపల్ నిర్వాకంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు కంప్లైంట్ అందింది. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
Translate this News: