Baltimore Bridge Accident: అమెరికా బాల్టిమోర్లోని వంతెనను కార్గో షిప్ (Cargo Ship) ఢీకొన్న విషయం తెలిసిందే. కాగా ఇందులో ఉన్న 22 మంది భారతీయులేనని (Indians) సినర్జీ మెరైన్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇద్దరు పైలట్లతో సహా అందులోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని పలు నివేదికలు వెల్లడించాయి. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగగా ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన (Francis Scott Key Bridge) కుప్ప కూలిపోయింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్.. అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బాల్టిమోర్లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ కూలిపోవడంతో అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యల గురించి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్కు (Joe Biden) ఎప్పటికప్పుడూ తెలుసుకుంటున్నారని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Baltimore Bridge: పడవ ప్రమాదంలో బాధితులంతా భారతీయులే!
అమెరికా బాల్టిమోర్లోని వంతెనను ఢీకొన్న కార్గో షిప్లో ఉన్న 22 మంది భారతీయులేనని తెలుస్తోంది. మొత్తం 20 మంది గల్లంతు అవగా ఇద్దరు బయటపడ్డారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సహాయక బృందం తెలిపింది. ఈ ప్రమాదంలో ఉగ్రవాదుల ప్రమేయం లేదని అధికారులు తేల్చి చెప్పారు.
Translate this News: