Kavitha Bail : ఎమ్మెల్సీ కవిత ఈడీ(ED) రిమాండ్ ఇవాళ్టి(మార్చి 26)తో ముగియనుంది. ఢిల్లీ(Delhi) లోని రౌస్ అవెన్యూ కోర్టు కవిత రిమాండ్ను ఇవాళ్టి వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తన అరెస్టు చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టులో పోరాడతానని కవిత ఇప్పటికే అనేకమార్లు చెప్పారు. ఇది రాజకీయ కేసు, కల్పిత కేసు, తప్పుడు కేసు అని అంటున్నారు. అవే విషయాలను పదేపదే అడుగుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇన్ని అరెస్టులు ఎందుకని ప్రశ్నించారు. ఇది పొలిటికల్ అరెస్ట్ అని భారత్ ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలన్నారు.
పూర్తిగా చదవండి..Kavitha Case : కవితకు బెయిల్ ?? కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఉత్కంఠ!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ కస్టడీలో ఉన్న కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఇవాళ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మరోవైపు ఈడీ కస్టడీ కూడా ఇవాళ్టితో ముగియనుంది. దీంతో కవితకు జైలా.. బెయిలా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Translate this News: