Varanasi Fight : వారణాసి లోక్సభ స్థానం(Lok Sabha Seat) నుంచి తమ అభ్యర్థిగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్రాయ్ ను కాంగ్రెస్(Congress) ప్రకటించింది. ఆయన వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పై పోటీ చేయనున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మోదీపై పోటీ చేశారు. రెండు ఎన్నికల్లోనూ మూడో స్థానంలో నిలిచారు. 2014 లోక్సభ ఎన్నికల్లో మోదీపై అజయ్రాయ్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఆమ్ ఆద్మీ పార్టీ(AAM) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) కూడా ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అజయ్ రాయ్ మూడో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లోనూ అజయ్ రాయ్ మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఎస్పీకి చెందిన షాలినీ యాదవ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ అజయ్ రాయ్ వారణాసి లోక్సభ స్థానానికి అభ్యర్థిగా నిలబెట్టింది. ఈసారి ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది.
పూర్తిగా చదవండి..Modi Vs Ajay : మోదీపై వరుసగా మూడోసారి పోటికి దిగబోతున్న అజయ్రాయ్ ఎవరు?
బీజేపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అజయ్ రాయ్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వరుసగా మూడోసారి మోదీని ఢీ కొట్టనున్నారు. ఈ సారి ఎస్పీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. ఇంతకి ఎవరీ జయ్రాయ్? వారణాసిలో మోదీకి ఆయన షాక్ ఇవ్వగలరా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: