Martyr’s Day 2024 : ‘పెంపుడు కుక్కను ఒళ్లో కుర్చోబెట్టుకుంటాం, కానీ సాటి మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం.. ఎంత సిగ్గుచేటు..’ అంటాడు భగత్ సింగ్ (Bhagat Singh). ఈ విప్లవవీరుడు గురించి ఎప్పుడు మాట్లాడుకునే సందర్భం వచ్చినా ఆయన్ను స్వాతంత్ర్య సమరయోధుడుగానే ప్రభుత్వాలు కీర్తిస్తుంటాయి. చిన్నతనం నుంచి అదే విషయాన్ని పుస్తకాల ద్వారా పిల్లల్లో నూరిపోస్తాయి. ఇదంతా నిజమే. భగత్సింగ్ భారతదేశ స్వాతంత్ర్యం కోసం, విముక్తి కోసం పోరాడిన వీరుడే.. ఇందులో మరోమాట లేదు. అయితే భగత్సింగ్ని స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు. ఆయన భావజాలం, సిద్ధాంతాలు, అంటరానితనంపై ఆయన విప్పిన గళం గురించి తెలుసుకోకపోతే భగత్సింగ్ పూర్తిగా అర్థంకాడు. ఆయన నాస్తికత్వాన్ని నాటి, నేటి పాలకులు ఎంత దాచినా అది వ్యాపిస్తూనే ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూనే ఉంటుంది. ఇవాళ(మార్చి 23) షాహీద్ దివాస్ (Shaheed Diwas). భగత్ సింగ్, సుఖ్ దేవ్ (Sukhdev), రాజ్ గురుల (Rajguru) త్యాగాన్ని భారతదేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. దేశ ప్రజలను బానిస బతుకుల నుంచి విముక్తి చేయడానికి అసమాన కృషి చేసిన విప్లవవీరులు వీరు. బ్రిటీష్ అధికారి సాండర్స్ హత్య కేసులో దోషిగా తేలిన ఈ ముగ్గురిని 1931 మార్చి 23న లాహోర్ సెంట్రల్ జైలులో ఉరితీశారు. ఇదంతా అందరికి తెలిసిన విషయం. ప్రభుత్వాలు ప్రతీఏడాదీ గుర్తుచేసే అంశం. అయితే భగత్సింగ్ గురించి ఎన్నో విషయాలను దాచిపెట్టే ప్రయత్నాలు చేశాయి ప్రభుత్వాలు. మతతత్వం, కులోన్మాదంపై భగత్సింగ్ పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనివ్వకుండా జాగ్రత్త పడ్డాయి.
పూర్తిగా చదవండి..Shaheed Diwas: మతతత్వం, కులోన్మాదంపై పోరాడిన విప్లవవీరుడు.. భగత్సింగ్ గురించి ప్రభుత్వాలు చెప్పని సత్యాలు!
మార్చి 23, 1931న స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, అతని సహచరులు శివరామ్ రాజ్గురు, సుఖ్దేవ్ థాపర్ను బ్రిటిష్ వారు ఉరితీశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలను త్యాగం చేసిర వీర యోధుడు గురించి ప్రభుత్వాలు చెప్పని నిజాలు ఏంటో ఆర్టికల్లోకి వెళ్లి తెలుసుకోండి.
Translate this News: