Vishwambhara: పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ పై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ‘విశ్వంభర’ లో మెగాస్టార్ సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష కథానాయికగా నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది 2025 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
పూర్తిగా చదవండి..Vishwambhara: విశ్వంభర సెట్స్ నుంచి త్రిష పోస్ట్.. వైరలవుతున్న ఫొటో
'బింబిసారా' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. తాజాగా త్రిష ఈ మూవీ సెట్స్ లో చిరంజీవి, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. లెజెండరీలతో కూడిన దివ్యమైన ఉదయం అని రాసుకొచ్చింది.
Translate this News: