సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. విజ్ఞాన్భవన్ ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ తో పాటు జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధులతో కలిసి ఎన్నికల షెడ్యూల్న్ విడుదల చేస్తున్నారు. 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుత లోక్సభకు జూన్ 16తో గడువు ముగియనుంది. దీంతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషన్.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలను నిర్వహించింది.
పూర్తిగా చదవండి..🔴Lok Sabha Elections 2024: ఎన్నికల షెడ్యూల్ ఈసీ లైవ్
కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఇంకా ఆంధ్రా, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ECI సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో ఈషెడ్యూల్ ప్రకటనను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది.
Translate this News: