AE Rahul : ఓ ప్రభుత్వ అధికారి ఏకంగా 15 కోట్ల రూపాయలను మాయం చేశాడు. కాంట్రాక్టర్లకు పనులు(Contract Works) ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు. జులై 11న కీసరగుట్ట పోలీస్ స్టేషన్(Keesaragutta Police Station) లో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎనిమిది నెలల నుండి అజ్ఞాతంలో ఉన్న మిషన్ భగీరథ ఏఈ రాహుల్(AE Rahul) ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో భాగంగా రాహుల్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Hyderabad : కీసర ఏఈ రాహుల్ అరెస్ట్.. దుబాయ్ చెక్కేస్తుండగా పట్టుకున్న పోలీసులు!
కీసర మిషన్ భగీరథ ఏఈ రాహుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంట్రాక్టర్లకు పనులు ఇప్పిస్తానని నమ్మబలికి ఏకంగా రూ.15 కోట్ల అప్పులు చేసి దుబాయ్ చెక్కేస్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారు. 37 మంది రాహుల్ బాధితులు ఉన్నట్లు సమాచారం.
Translate this News: