Nagababu: జనసేన శ్రేణులకు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆసక్తికర సూచనలు చేశారు. ఇది ఆలోచించాల్సిన సమయం కాదని, నాయకుడి ఆదేశాలను ఆచరణలో పెట్టాలంటూ ట్వీట్ చేశారు. ‘సందిగ్ధాల సమయం కాదిది.. సమరానికి సిద్ధం కావాల్సిన సమయం. విమర్శ, విభేదాలకు సమయం కాదిది.. విజ్ఞతతో విజయ దుందుభి మోగించాల్సిన సమయం. శత్రువు మాయలో పడి నాలుగేళ్ల దగా మర్చిపోతున్నావ్.. తీర్చుకోవాల్సిన పగా మర్చిపోతున్నావ్. నిర్లక్ష్యం వీడు.. నిజాన్ని చూడు. నమ్మి నాయకుడి నిర్ణయాలతో నిలబడు. సేనా.. సిద్ధం సిద్ధం అన్నోళ్లకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం’ అంటూ పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ‘నాయకుడి నిర్ణయం వైపు నిలబడు.. నాయకుడి తో కలిసి కలబడు.. సేనాని సిద్దం. సేనా… ఇక ప్రత్యర్థి కి ఇద్దామ యుద్ధం’ అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
పూర్తిగా చదవండి..AP: సిద్ధం అన్నోళ్లకి ఈసారి మర్చిపోలేని యుద్ధమే.. నాగబాబు ట్వీట్ వైరల్!
జనసైనికులకు పార్టీ సీనియర్ నేత నాగబాబు కీలక పిలుపునిచ్చారు. ‘సందిగ్ధాల సమయం కాదిది.. సమరానికి సిద్ధం కావాల్సిన సమయం. నిర్లక్ష్యం వీడు.. నిజాన్ని చూడు. నమ్మిన నాయకుడి నిర్ణయాలతో నిలబడు. సిద్ధం సిద్ధం అన్నోళ్లకి ఈసారి ఇద్దాం మర్చిపోలేని యుద్ధం’ అంటూ ట్వీట్ చేశారు.
Translate this News: