Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదని.. గుడ్డి గుర్రమని సెటైర్ విసిరారు. శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం, జీవో3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ముగిసింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని.. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..Kavitha: రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం: రేవంత్ పై కవిత సెటైర్స్!
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అని, రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రమంటూ సెటైర్ వేశారు. మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరంటూ ఈ రోజు ఇందిరాపార్క్ ధర్నా వేదికగా ఆమె వ్యాఖ్యానించారు.
Translate this News: