BJP Mulls Fielding Cricketer Mohammad Shami From Bengal : రానున్న లోక్సభ ఎన్నిక(Lok Sabha Elections) ల్లో టీమిండియా(Team India) స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ(Mohammad Shami) ని బరిలోకి దింపాలని బీజేపీ(BJP) ఆలోచిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే షమీని బీజేపీ సంప్రదించింది కూడా. అయితే షమీ మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎన్నికలలో పోటీ చేయమని బీజేపీ షమీని కోరినట్లుగా సమాచారం. బెంగాల్(Bengal) లోని బసిర్హత్ లోక్సభ స్థానం నుంచి షమీని పోటీకి దింపాలని బీజేపీ భావిస్తోందట. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్కు చెందిన నుస్రత్ జహాన్(Nussrat Jahan) ఈ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. సందేశ్ఖాలీ ప్రాంతం కూడా ఈ పార్లమెంట్ స్థానం పరిధిలోకి వస్తుంది. సందేశ్ఖాలీ ఇటీవలి నిత్యవ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. అక్కడి టీఎంసీ నేతల మహిళలపై లైంగిక దాడులతో పాటు భూములను కబ్జా చేసుకున్నారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు TMC మాజీ నాయకుడు షాజహాన్ షేక్తో పాటు అతని అనుచరుల తమపై వేధింపులకు పాల్పడ్డారని నిరసనలు చేస్తున్నారు. షాజహాన్ను ఇటీవల అరెస్టు చేసి సీబీఐకి అప్పగించారు.
పూర్తిగా చదవండి..Shami : బీజేపీలోకి స్టార్ క్రికెటర్ షమీ.. ఆ లోక్సభ స్థానం నుంచి పోటి?
రానున్న లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీకి బీజేపీ ప్రతిపాదన చేసింది. దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరపున షమీ ఆడాడు. బసిర్హత్ లోక్సభ స్థానం నుంచి నుస్రత్ జహాన్పై షమీని పోటీకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
Translate this News: