Nandyal District : మృత్యువు ఏ క్షణం ఎటు వైపు నుంచి దూసుకొస్తుందో తెలియదు. రెప్పపాటు కాలంలో ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి. ఏమరపాటు మృత్యు కౌగిల్లోకి తీసుకెళ్తుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబాలు ఒక్కసారి తీవ్ర విషాదంలోకి వెళ్లిపోతాయి. కన్నీరుమున్నిరుగా విలపిస్తాయి. ముఖ్యంగా రోడ్లపై జర్నీ(Road Journey) అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. రాత్రి ప్రయాణాలు(Night Journey) కచ్చితంగా రిస్కుతో కూడుకున్నవే. ఈ విషయం మరోసారి స్పష్టమైంది. నంద్యాల జిల్లా(Nandyal District) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) తీవ్ర విషాదాన్ని నింపింది.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి!
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా హైదరాబాద్ వాసులు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Translate this News: