Drugs : తమిళనాడు(Tamilanadu) నుంచి శ్రీలంకకు(Srilanka) అక్రమంగా తరలిస్తున్న రూ. 108 కోట్ల మాదకద్రవ్యాలను ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guards), DRI అధికారులు పట్టుకున్నారు. మండపం తీరంలో ఓ దేశీయ పడవ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు 99 కిలోల మాదక ద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి అధికారులు ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..Tamilanadu : తమిళనాడు నుంచి శ్రీలంకకు తరలిస్తున్న రూ.108 కోట్ల మాదకద్రవ్యాల పట్టివేత!
తమిళనాడు తీరం నుంచి మాదకద్రవ్యాలతో ఉన్న పడవ శ్రీలంక కు వెళ్తున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో పడవను వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఓ ప్రధాన నిందితుడుతో పాటు మరో నలుగురిని డీఆర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు.
Translate this News: