Jaya Prada : చాలారోజులుగా సమన్లు అందినా స్పందించకుండా తప్పించుకుంటూ వస్తున్నా బీజేపీ(BJP) మాజీ ఎంపీ సినీనటి జయప్రద(Ex. MP Jaya Prada) కోర్టులో ఎట్టకేలకు లొంగిపోయారు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఆమె ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెపై కేసులు నమోదు చేశారు. జయప్రదపై రాంపూర్లో రెండు కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసుల విషయంలో జయప్రదకు కోర్టు చాలాసార్లు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో రాంపూర్ కోర్టు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జయప్రదపై కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి జయప్రద పరారీలో ఉన్నారు. జయప్రద పై కోర్టు మొత్తం ఏడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. వాటికి జయప్రద నుంచి స్పందన లేకపోవడంతో నటి జయప్రద పరారీలో ఉన్నారని ఫిబ్రవరి 27న రాంపూర్ కోర్టు ప్రకటించింది.
పూర్తిగా చదవండి..Jayaprada : కోర్టులో లొంగిపోయిన జయప్రద.. కేసుల నుంచి బయటపడేనా?
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై సినీ నటి జయప్రదపై యూపీ లోని రాంపూర్ లో కేసులు నమోదు అయ్యాయి. వీటిపై రాంపూర్ కోర్టు నోటీసులకు ఆమె స్పందించలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది కోర్టు. ఈ క్రమంలో రాంపూర్ కోర్టులో ఆమె లొంగిపోయారు.
Translate this News: