AP DSC Schedule Suspended: జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ను హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న రిలీజ్ కానున్నాయి. మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై లాయర్ శరత్ చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్క రోజు సమయంలో విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదించారు. నిరుద్యోగుల హక్కులను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..BREAKING: ఏపీలో డీఎస్సీ షెడ్యూల్ సస్పెండ్.. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. !
మార్చి 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14న రిలీజ్ కానుండగా మార్చి 15 నుంచి డీఎస్సీ ఎగ్జామ్ పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
Translate this News: