Uttam kumar: మార్చి 6వ తేదీన కాళేశ్వరం పరిశీలనకు నిపుణుల కమిటీ రాబోతుందని కాంగ్రెస్ నీటీ పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ అవినీతిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీ రాకను తాము స్వాగతిస్తున్నామన్నారు. కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తామని, నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ సూచనలను ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గతంలో కుంగిపోయిన మెడిగడ్డ బ్యారేజ్ ను నేషనల్ డ్యామ్ సెఫిటీ అథారిటీ పరిశీలించి నీటిని ఖాళీ చేయాలని సూచించినట్లు గుర్తు చేశారు. సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్ లను పరిశీలించిన డ్యామ్ సెఫిటీ అథారిటీ మెడిగడ్డలో ఉన్న సమస్యలు ఇక్కడ కూడా ఉన్నాయని, ఈ రెండు బ్యారేజ్ లలో కూడా నీటిని ఖాళీ చేయాలని సూచించిందన్నారు.
పూర్తిగా చదవండి..TS: బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదు.. ఉత్తమ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
బీఆర్ఎస్ నాయకులకు సాంకేతిక అవగాహన లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. 'వాళ్ల మాటలకు విలువ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటి మెడిగడ్డ కుంగిపోతే ఆవేదన వ్యక్తం చేయకుండా ఒక్క పిల్లర్ కుంగిపోయిందని మాట్లాడటం అత్యంత దురదృష్టకరం'అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Translate this News: