YS Sunitha Targets CM Jagan: ఐదేళ్ల క్రితం జరిగిన వైఎస్ వివేకా హత్య రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించింది. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ హత్య జరగడం రాజకీయంగా పెను ప్రకంపనలు రేపింది. ఈ హత్యలో నిందితులుగా ఉన్నవారు వైసీపీకి చెందినవారు కావడంతో ప్రతిపక్ష టీడీపీ ఈ కేసును ఎన్నికల ప్రచారంలో ఇప్పటికీ వాడుకుంటోంది. అదే సమయంలో వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి చావుకు కారణమైన వారికి శిక్ష పడాలని ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. వివేక హత్య జరిగి ఐదేళ్లు కావోస్తున్న సమయంలో సునీతారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
మీడియా సమావేశంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి ఏం అన్నారంటే?
YS Viveka Murder Case: వివేక హత్య కేసు.. జగన్ పాత్రపై సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
నాన్న(వివేక)ను గొడ్డలితో చంపారనే విషయం జగనన్నకు ఎలా తెలుసని నిలదీశారు వైఎస్ సునీత. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారని.. ఇందులో జగన్ పాత్రపై విచారణ జరగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఒక్కరే తనకు మొదటి నుంచి అండగా నిలిచారన్నారు.
Translate this News: