Harirama Jogaiah Letter to TDP-Janasena: కాపుల సంక్షేమం కోసం పాటుపడే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య జనసేన, టీడీపీ పొత్తుపై విసుగు చెందినట్టుగా అర్థమవుతోంది. జనసేనకు కేవలం 24 సీట్లే ఇవ్వడాన్ని అంగీకరించని జోగయ్య ఇటివలి కాలంలో లేఖస్త్రాల సంఖ్యను రెట్టింపు చేశారు. కూటమిలో ప్రాధాన్యత, స్పష్టత రావాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేతకు ఆయన అనేక లేఖలో సలహాలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఇకపై పొత్తు గురించి పవన్తో (Pawan Kalyan) పాటు చంద్రబాబుకు (Chandrababu) సైతం సలహాలు ఇవ్వడం మానేయాలని హరిరామ జోగయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనకు, పార్టీకి అండగా నిలబడే వారే కావాలి తప్ప వేరే చోట కూర్చొని సలహాలు ఇచ్చే వారు కాదని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హరిరామ జోగయ్య రాసిన లేఖ సంచలనం రేపుతోంది.
పూర్తిగా చదవండి..TDP-Janasena Alliance: ఇక మీ ఖర్మ.. పవన్, చంద్రబాబుకు జోగయ్య దండం 🙏🙏🙏 !
జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా పవన్ పార్టీకి కేవలం 24 సీట్లే కేటాయిస్తుండడంపై మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాను ఇచ్చిన సలహాలు ఇద్దరు అధినేతలకు నచ్చినట్లు లేవని.. అది వారి ఖర్మ.. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదని సంచలన లేఖ రాశారు.
Translate this News: