Bala Krishna: టాలీవుడ్ స్టార్ సీనియర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారు. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని చెప్పుకొచ్చారు. టీడీపీకి ఉన్న బలం కార్యకర్తలేనని బాలయ్య వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Bala Krishna: అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. వైసీపీ మంత్రులకు బాలయ్య వార్నింగ్
వైసీపీపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకే బ్యాచ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు.
Translate this News: