TDP-Janasena : ఏపీలో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగబోయే టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఉండవల్లి వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు.
మాగా పౌర్ణమి శుభ ముహూర్తం..
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఈ రోజు మాగా పౌర్ణమి. శుభ ముహూర్తం. రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్టాన్ని కాపాడుకోవడం కోసం ఈ కలయిక. దీనిపై అనేక సార్లు మాట్లాడుకొన్నామన్నారు. జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. తెలుగు దేశం 94 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేనుందని తెలిపారు. బీజేపీ కలిసివస్తే తగిన నిర్ణయాలు, తగిన సమయంలో తీసుకొంటామన్నారు.
AP: టీడీపీ-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్..!
ఏపీలో టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా విడుదలైంది. ఉండవల్లి వేదికగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మొదటి గెలుపు గుర్రాలను ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు. తెలుగు దేశంకు 94 అసెంబ్లీ స్థానాలను కేటాయించారు.
Translate this News: