Director Yashasvi: హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి స్టార్ డైరెక్టర్స్ దగ్గర పని చేసిన యశస్వి.. “సిద్ధార్థ్ రాయ్” సినిమాతో డెబ్యూ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఆర్య, అతడు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన దీపక్ సరోజ్ హీరోగా నటించారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ యశస్వి.. సంగీత దర్శకుడు రధన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రధన్ పై యశస్వి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాల్ వైరల్ గా మారాయి.
Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్
Director Yashasvi: ‘నాలా ఇంకెవరూ మోసపోవద్దు’.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై వైరలవుతున్న యశస్వి కామెంట్స్
"సిద్ధార్థ్ రాయ్'' మూవీ డైరెక్టర్ యశస్వి.. సంగీత దర్శకుడు రధన్ పై ఫైర్ అయ్యారు . రధన్ కారణంగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యమైందని ఆరోపించారు. నాలా ఇంకెవరూ మోసపోవద్దని చెబుతున్నాను అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: