Minister Gummanur Jayaram: కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారం అధికార పార్టీ వైసీపీని కలవరపెడుతోంది. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి గుమ్మునురు జయరాం వైసీపీకి దూరం అవుతున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. త్వరలో సొంత గూడు టీడీపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీటిని మాత్రం మంత్రి గుమ్మ నూరు జయరాం కానీ.. ఆయన అనుచరులు కానీ ఎక్కడా ఖండించలేదు. దీంతో పార్టీ మార్పు కన్ ఫాం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kurnool: వైసీపీకి బిగ్ షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటే పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు
కర్నూలు వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. మంత్రి గుమ్మనూరు జయరాంతో పాటు ముగ్గురు జడ్పీటీసీలు, ఇద్దరు ఎంపీపీలు వైసీపీని వీడెందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. మంత్రి టీడీపీలో చేరగానే వైసీపీ నుండి టీడీపీలో చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Translate this News: