Kejriwal Attended Court: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు రోస్ అవెన్యూ కోర్టు విచారణలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కోర్టుకు హాజరయ్యారు. బడ్జెట్ సెషన్ కారణంగా కేజ్రీవాల్ భౌతికంగా హాజరు కాలేకపోయారని ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ కోసం కోర్టు తదుపరి తేదీని మార్చి 16గా ఇచ్చింది. కోర్టులో విచారణ సందర్భంగా కేజ్రీవాల్ ఓ విషయాన్ని స్పష్టం చేశారు. తదుపరి విచారణలో తానే హాజరవుతానని కేజ్రీవాల్ చెప్పారు.
పూర్తిగా చదవండి..Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఆ రోజే కోర్టుకు వస్తా: కేజ్రీవాల్!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈడీ సమన్లు, కోర్టుకు రాకపోవడానికి గల కారణాలను చెప్పారు. తదుపరి విచారణ(మార్చి 16)లో తానే కోర్టుకు భౌతికంగా హాజరవుతానని కేజ్రీవాల్ తెలిపారు.
Translate this News: