Law Commission on NRI Marriages: నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐలు), ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)లతో భారతీయ పౌరుల వివాహాలకు సంబంధించిన భారత్ లా కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐల మోసం ఆందోళనకరమని లా కమిషన్ పేర్కొంది. దేశంలోనే ఎన్నారైలు, ఓసీఐలతో భారతీయుల వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ (రిటైర్డ్) రుతురాజ్ అవస్తీ నివేదిక సమర్పించారు. ప్రవాస భారతీయులు, భారత విదేశీ పౌరులకు సంబంధించిన మ్యాట్రిమోనియల్ సమస్యలపై ‘చట్టం’ అనే శీర్షికతో న్యాయ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించారు.
పూర్తిగా చదవండి..Law: భారతీయ పౌరులను వివాహం చేసుకునే NRIలకు ఇక కఠిన రూల్స్.. ఫ్రాడ్ చేస్తే అంతేసంగతి!
ఎన్ఆర్ఐ-ఓసీఐ భార్యాభర్తల పాస్పోర్ట్లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయాలని లా కమిషన్ సిఫార్సు చేస్తోంది. NRI/OCI-భారతీయ పౌరుల మధ్య జరిగే అన్ని వివాహాలు తప్పనిసరిగా భారత్లో ఇకపై నమోదు చేసుకునేలా రూల్స్ తీసుకొస్తున్నారు. కమిషన్ ఛైర్మన్ అవస్తీ ఈ నివేదిక సమర్పించారు.
Translate this News: