Ashwin Out of Team India Due to medical emergency: మూడో టెస్టులో ఇండియా, ఇంగ్లండ్ హోరాహోరీగా తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ లక్ష్యం సాధించగా.. ఇంగ్లండ్ సైతం ధీటుగా బదులిస్తోంది. బాజ్ బాల్ బ్యాటింగ్ శైలీలో దుమ్ములేపుతోంది. నిన్న రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 35 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 207 రన్స్ చేసింది. ఓపెనర్ బెన్ డక్కెట్ 118 బంతుల్లోనే 133 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక జో రూట్ సైతం క్రీజులోనే ఉన్నాడు. భారత్ సాధించిన రన్స్కు ఇంగ్లండ్ ఇంకా 238 రన్స్ వెనకబడి ఉంది. ఇదే సమయంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. 500 టెస్టు వికెట్ల హీరో రవిచంద్రన్ అశ్విన్ జట్టును వీడాడు.
పూర్తిగా చదవండి..IND vs ENG: టీమిండియాకు భారీ షాక్.. సడన్గా టీమ్ని వీడిన అశ్విన్.. ఎందుకంటే?
ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రవిచంద్రన్ అశ్విన్ భారత టెస్టు జట్టు నుంచి వైదొలిగాడు. రాజ్కోట్ టెస్టులో ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. ఈ మూడు రోజులు అశ్విన్ అందుబాటులో ఉండడు. నిన్న జాక్ క్రావ్లీ వికెట్ ద్వారా టెస్టుల్లో అశ్విన్ 500వ వికెట్ సాధించిన విషయం తెలిసిందే.
Translate this News: