YCP Rebel MLA’s: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నేడు విచారణకు హాజరుకావాలని రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు హాజరుకావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. అయితే, ఈ ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్ నోటీస్ ను ఏ మాత్రం లెక్కచేయనట్లుగా తెలుస్తోంది. విచారణకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరుకాని పరిస్థితి కనిపిస్తోంది. స్పీకర్ తమ్మినేని సీతారాం తన కార్యాలయంలో 12.30 వరకు ఎదురుచూసిన వారు మాత్రం విచారణకు హజరుకాలేదు.
పూర్తిగా చదవండి..YCP: మళ్లీ విచారణకు డుమ్మా కొట్టిన వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకాలేదు. రెండు వారాల సమయం కావాలని వారు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీంతో, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ నెలకొంది.
Translate this News: