Hyderabad: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి (Subbareddy), మంత్రి పెద్దిరెడ్డి (Peddireddy) రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ను ఏపీ రాజధానిగా కొనసాగించాలనే ఆయన డిమాండ్ హాస్యాస్పదమన్నారు. ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుండి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాట్లాడుతున్నారంటే.. ఇక్కడి ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనేనన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలనే మేము కోరుకుంటున్నామని.. మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకుంటూ అభివృద్ధి చెందండి.. కానీ మీ రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని హెచ్చరించారు.
పూర్తిగా చదవండి..Hyderabad: హైదరాబాద్ జోలికొస్తే మిమ్మల్ని వదలం.. ఏపీ నాయకులకు తెలంగాణ నేతలు వార్నింగ్
హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రెండు రాష్ట్రాలు బాగుండాలి. మీ రాష్ట్రాన్ని మంచిగా పాలించుకోండి. రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దు' అని హెచ్చరించారు.
Translate this News: