Kadapa: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచార రంగంలో దూకిన పార్టీలు పోటా పోటీగా ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అధికార పార్టీ సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అనే ఫ్లెక్సీలు కూడా వేయించారు. అయితే, ఈ ఫ్లెక్సీలపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. దేనికి సిద్ధం జగన్ అంటూ దుమ్మెత్తిపోశారు. ఇలా కొంతవరకు ఫ్లెక్సీల మాటల యుద్ధం నడిస్తే పలుచోట్ల ఫ్లెక్సీల వార్ కూడా నడుస్తోంది. జనసేన, టీడీపీ ఫ్లెక్సీలను అధికార పార్టీ నేతలు తొలగించారంటూ కేసులు కూడా నమోదు అయ్యాయి. అంతేకాదు ఇరుపార్టీ నేతలు గొడవలకు దిగి రచ్చ రచ్చ చేసిన వార్తలు కూడా మనం చూసాం.
పూర్తిగా చదవండి..Kadapa: కడపలో ఫ్లెక్సీల రగడ.. స్టేషన్ ఎదుట జనసైనికుల ఆందోళన
కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరులో ఫ్లెక్సీల రగడ నెలకొంది. తమ పార్టీ ప్లెక్సీలు చించివేయడంతో జనసైనికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
Translate this News: