Sarojini Naidu Birthday : నేడు(ఫిబ్రవరి 13) భారత జాతీయ మహిళా దినోత్సవం(National Women’s Day). ఫిబ్రవరి 13న జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. సరోజినీ నాయుడు(Sarojini Naidu) భారతదేశపు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు.. కవయిత్రి కూడా. ఆమెను భారత్ కోకిల అంటే నైటింగేల్ ఆఫ్ ఇండియా(Nightingale Of India) అని కూడా పిలుస్తారు. ఇది మాత్రమే కాదు, ఆమె స్వతంత్ర భారతదేశానికి మొదటి మహిళా గవర్నర్ కూడా. దేశానికి స్వాతంత్య్రం పొందడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్రం ఉద్యమంలో ఆమె పాత్ర ముఖ్యమైనది. ప్రతి మహిళకు ఆమె స్ఫూర్తి. ఫిబ్రవరి 13న సరోజినీనాయుడు జన్మించారు. అందుకే ఈరోజును జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. మార్చి 8న జరుపుకునే మహిళా దినోత్సవం(Women’s Day) కంటే ఇది భిన్నమైనది. ఎందుకంటే ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఫిబ్రవరి 13 భారత మహిళా దినోత్సవం. కన్ఫ్యూజ్ అవొద్దు.
పూర్తిగా చదవండి..National Women’s Day: సరోజినీ నాయుడు జన్మదినాన్ని మహిళా దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
సరోజినీనాయుడు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన మహిళ. ఫిబ్రవరి 13, 1879న హైదరాబాద్లోని బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి కవిత్వం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉండేది. ఆమె జన్మదినాన్నే జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు.
Translate this News: