Gruha Jyothi Implementation : తెలంగాణ(Telangana) లో గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme) అమలుకు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. గ్రేటర్లో ఇవాళ్లి నుంచే గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ కానున్నాయి. వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్(Free Current) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుంచి క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రతి నెల మొదటివారంలో 10రోజుల పాటు.. మీటర్ రీడింగ్తో పాటు లబ్ధిదారుల గుర్తింపు ఉంటుంది. మీటర్ రీడింగ్(Meter Reading) తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్(Revanth Sarkar). మీటర్ రీడర్కు రేషన్, ఆధార్ కార్డ్ నంబర్లతో పాటు, మొబైల్ నంబర్ లింక్ చేస్తారు. రీడింగ్ కోసం తెచ్చిన హ్యాండ్ హెల్త్ మెషీన్లో ఎంట్రీ చేస్తారు.
పూర్తిగా చదవండి..Gruha Jyothi : 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్.. గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్!
నెలవారీ వినియోగానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం గృహజ్యోతి లబ్ధిదారుల గుర్తింపు కోసం తెలంగాణ ఇంధన శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి మీటర్ రీడర్లు ఇంటింటికి వస్తారు. గృహ జ్యోతి పథకంలో చేరాలనుకునే వారు తమ తెల్లరేషన్ కార్డులు, ఆధార్ కార్డులను వారికి చూపించాలి.
Translate this News: