Vijayasai Reddy vs Congress: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరిగింది. వైఎస్ఆర్సిపి తరఫున చర్చలో పాల్గొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఏపీకి విలన్ అని ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ కంటి తుడుపు హామీ ఇచ్చిందన్నారు. ఏపీపై కాంగ్రెస్కు (AP Congress) చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ప్రత్యేక హోదా పొందుపరిచేందుకు ఎందుకు విస్మరించారని నిలదీశారు. విభజన చట్టంలో (Bifurcation Law) ప్రత్యేక హోదా చేర్చడంలో ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. చట్టంలో చేర్చడం కాంగ్రెస్కు చేతగాక, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారని మండిపడ్డారు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy).
ఇక అంతటితో ఆగలేదు విజయసాయిరెడ్డి.. తెలంగాణ రాజకీయాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress) ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదని విమర్శించారు. మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చిందని. ఏపీకి ప్రత్యేకహోదా (AP Special Status) ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు విజయసాయిరెడ్డి. ఏపీకి చేసిన మోసానికి కాంగ్రెస్కు తగిన శిక్ష పడాలన్నారు.
Vijayasai: త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ను ప్రజలు నమ్మలేదని విమర్శించారు. మోసపూరితపు హామీలతో పదేళ్లకు అధికారంలోకి వచ్చిందని. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.
Translate this News: