Special officers in villages: సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సుముఖంగా లేని ప్రభుత్వం ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓ, డీటీ, ఆర్ఐ, ఇంజనీర్లు, ఇతర గెజిటెడ్ అధికారులను ఆయా మండలాల్లోని గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించింది. సర్పంచ్ల పదవీకాలాన్ని పొడిగించాలన్న విజ్ఞప్తులు వచ్చినా ప్రభుత్వం ఆ దిశగా ఆసక్తి చూపలేదు. దీంతో రాష్ట్రంలోని గ్రామాల్లో పది సంవత్సరాల అనంతరం మళ్లీ ప్రత్యేకాధికారుల పాలన మొదలు కాబోతోంది. గతంలో ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2011 నుంచి 2013 వరకు; 2018లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి.
పూర్తిగా చదవండి..గ్రామాల్లో ‘ప్రత్యేక’ పాలన.. స్పెషల్ ఆఫీసర్లను నియమించిన ప్రభుత్వం
సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. ప్రత్యేకాధికారి, కార్యదర్శికి కలిపి ఉమ్మడిగా ప్రభుత్వం చెక్ పవర్ కల్పించింది.
Translate this News: