Madras High Court Judgement on Temple Entry : తమిళనాడు(Tamilnadu) లోని పళని దేవాలయం కేసులో మద్రాసు హైకోర్టు(Madras High Court) సంచలన తీర్పునిచ్చింది. ధ్వజస్థంభం దాటి హిందువులు కానివారిని అనుమతించరాదని మద్రాసు హైకోర్టు పేర్కొంది. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద బోర్డు పెట్టాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలతో పాటు ఆలయానికి సంబంధించిన అధికారులకు కూడా కోర్టు ఈ ఆదేశాలను ఇచ్చింది. ఆచారాలు, పద్ధతుల ప్రకారం ఆలయాన్ని నిర్వహించాలని కోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 కిందకి ఆలయాలు రావని హైకోర్టు పేర్కొంది. అలాంటి పరిస్థితిలో, హిందుయేతరుల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని అన్యాయంగా పరిగణించలేమని చెప్పుకొచ్చింది.
పూర్తిగా చదవండి..Hindu Temples : పిక్నిక్ స్పాట్స్ కావు.. దేవాలయాల్లో వాళ్లకి ప్రవేశం నిషేధమంటూ కోర్టు సంచలన తీర్పు!
రాతపూర్వక హామీ లేకుండా హిందువులు కానివారిని ఆలయం లోపలికి అనుమతించకూడదంటూ మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. ధ్వజస్థంభం దాటి ఆలయ ప్రాంగణం లోపల 'హిందువులు కానివారిని అనుమతించడం లేదు'అని సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Translate this News: