Governor’s quota MLCs issues: గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లు సిఫార్సు చేయగా ప్రభుత్వ సిఫార్సులను గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ తిరస్కరించారు. దీంతో దాసోజు శ్రవణ్ కుమార్ , కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.తమ కేసు తేలే వరకు కొత్తగా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును పిటిషనర్లు కోరారు. ఈ క్రమంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు నిలిపివేస్తూ .. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు అంటే ఫిబ్రవరి 8వ తేదీ వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఆదేశించింది.
ALSO READ:కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువ.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు
పూర్తిగా చదవండి..