Bihar Political Drama : బీహార్(Bihar) లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య నితీశ్ కుమార్(Nitish Kumar) తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా(Resign) చేశారు. జేడీయూ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత నితీశ్ కుమార్ రాజీనామా లేఖను సమర్పించేందుకు రాజ్భవన్(Raj Bhavan) కు వెళ్లారు. అక్కడ గవర్నర్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఎన్డీయే మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. జేడీయూ శాసనసభా పక్ష సమావేశంలో నితీశ్ కుమార్ బీజేపీ సీనియర్ నేతతో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు ప్రమాణ స్వీకారానికి రాజ్భవన్లో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈరోజు సాయంత్రం తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజే నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Bihar : రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. సీఎం పదవికి నితీశ్ రాజీనామా..!
బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ మిత్రపక్షంగా మళ్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కూటములను మార్చడం నితీశ్ కుమార్కు ఇదేమీ కొత్త కాదు.
Translate this News: