Karnataka Mandya News : కర్ణాటక(Karnataka) లోని మాండ్య జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులకు గురైన 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమెపై అత్యాచారం జరిగిందని సమాచారం. అత్యాచారం తర్వాత గర్భం దాల్చిందని స్థానికులు చెబుతున్నారు. గర్భవతి(Pregnant) అని తెలియగానే ఆత్మహత్య(Suicide) కు పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక మైనర్ అని, వయసు 15 ఏళ్లు మాత్రమేనని మండ్య ఎస్పీ ఎన్.యతీష్ తెలిపారు. విద్యార్థిని మృతదేహం ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం తర్వాత ఆమె షాక్కు గురైందని, ఈ సమయంలో ఆమె గర్భవతి అని తెలియగానే ఒత్తిడి పెరిగిందని కుటుంబ సభ్యులు అంటున్నారు.
పూర్తిగా చదవండి..Crime News : 15 ఏళ్ల మైనర్పై అత్యాచారం.. గర్భం దాల్చడంతో బాలిక ఆత్మహత్య!
కర్నాటక మాండ్యాలో లైంగిక వేధింపులకు గురైన తొమ్మిదో తరగతి విద్యార్థిని గర్భవతి అని తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 15 ఏళ్ల బాలిక తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించిందని మాండ్య ఎస్పీ ఎన్ యతీష్ తెలిపారు. పొరుగింటి వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం.
Translate this News: