Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) అవినీతిపై అవినీతిపై రేవంత్ సర్కార్(Revanth Sarkar) గట్టిగానే ద్రుష్టి పెట్టింది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు తనిఖీలు కూడా చేశారు.ఇప్పడు ఈ ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టేందుకు సిద్ధంగాఉన్నామని సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది.
పూర్తిగా చదవండి..CBI on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.48వేల కోట్లు తిన్న మెఘా కృష్ణారెడ్డిపై సీబీఐ విచారణ?
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీబీఐ అభిప్రాయాన్ని హైకోర్టు అడగ్గా....విచారణకు సిద్ధంగా ఉన్నానని ,మానవ వనరులు,మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని సీబీఐ కోరింది.
Translate this News: