Why Jan 25 is Celebrated as National Voters Day: ప్రతి సంవత్సరం జనవరి 25న దేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ ఓటర్ల దినోత్సవం ఉద్దేశ్యం దేశంలోని పౌరులకు ఓటు పట్ల అవగాహన కల్పించడం, వారు ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడం. జాతీయ ఓటర్ల దినోత్సవం దేశంలోని పౌరులను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పటికీ ఓటరు గుర్తింపు లేని వ్యక్తులకు కూడా జాతీయ ఓటరు దినోత్సవం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం కావడంతో భారత ఎన్నికల సంఘం జాతీయ వేదికపై అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఓటు హక్కు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది.
పూర్తిగా చదవండి..National Voters Day 2024: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25నే ఎందుకు జరుపుకుంటారు?
భారత్ 1947లో స్వాతంత్రం పొందింది. మూడేళ్ల తర్వాత, అంటే 1950 జనవరి 26న దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దేశంలో ఎన్నికల సంఘాన్ని జనవరి 25, 1950లో స్థాపించారు. దీంతో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడానికి జనవరి 25ని ఎంచుకున్నారు.
Translate this News: