Tourist Places From North To South: భారత్ భిన్నత్వం కలిగిన దేశం. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న మన దేశంలో భౌగోళిక ప్రాతిపదికన వివిధ రకాల సుందర దృశ్యాలు కనిపిస్తాయి. మంచు పర్వతాల నుంచి ఇసుక మైదానాల వరకు, అడవుల నుంచి సరస్సులు, జలపాతాల వరకు, దేశవ్యాప్తంగా ప్రవహించే నదుల నుంచి సముద్ర అలల గర్జన వరకు ప్రతి సహజ దృశ్యాన్ని దేశంలో చూడవచ్చు. ఇక్కడ పురాతన, అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి చారిత్రక మసీదులు ఉన్నాయి, పోర్చుగీస్, రోమన్ శైలిలో నిర్మించిన చర్చిలు ఉన్నాయి. భారీ గురుద్వారాలు కూడా ఉన్నాయి. దేశంలో మతపరమైన ప్రదేశాలు మాత్రమే కాదు, చారిత్రక, రాజకీయ ప్రదేశాలు కూడా ఉన్నాయి. దేశంలోని ఈ పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడానికి, ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలో ఉత్తరాన కశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు వందలాది పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..National Tourism Day 2024: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. అత్యంత ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలివే!
పర్యాటక ప్రాంతాలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఉదయపూర్, గుల్మార్గ్, వారణాసి ముందు వరుసలో ఉన్నాయి.రాష్ట్రాల పరంగా చూస్తే అత్యధిక సంఖ్యలో పర్యాటకులు యూపీకి వెళ్తుంటారు.
Translate this News: